సిరా న్యూస్,నెల్లూరు;
బాల రాముడు నడయాడిన అయోధ్యలో శతాబ్దాల పోరాటం తరువాత తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటున్న సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఊరు ఊరు వాడ వాడ పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు రామ భక్తుల రామనామ స్మరణంతో నెల్లూరు పురవీధులు మారమోగాయి.