సిరా న్యూస్, జైనథ్:
కూరలో ఇంటింటికి అక్షింతలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామంలో ఇంటింటికి అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భజనలు చేసారు. ఈ సందర్భంగా పల్లకిలో అక్షింతలను, స్వామి వారి చిత్రపటాలను ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం పలువురు భక్తులు మాట్లాడుతూ.. శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన అక్షింతలను శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ తరపున ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అడ్డి శ్రీనివాస రెడ్డి, అడ్డి వెంకట్ రెడ్డి, ఏనుగు రాకేష్ రెడ్డి, సిడం రాకేష్, సంజీవ్ రెడ్డి, దశరథ్, కిష్టన్న, అశోక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ప్రసాద వితరణ గావించారు.