అయోధ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

కోనసీమ కొబ్బరి బొండాలు స్పెషల్
 సిరా న్యూస్,అయోధ్య;
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. దేశమంతా రామనామం మోగుతుంది. తమ ప్రాంతాల ప్రసిద్ధి చెందిన వాటిని రామయ్యకు కానుకగా ఇచ్చేందుకు అనేక మంది పడుతున్నారు. అందులో భాగంగా కోనసీమ నుంచి కొబ్బరిబోండాలను ప్రత్యేకంగా ఇక్కడి నుంచి అయోధ్యకు పంపుతున్నారు. రాములోరి కల్యాణానికి ఉపయోగించే విధంగా కల్యాణ బోండాలను కోనసీమ ప్రాంతం నుంచి నేడు బయలుదేరి అయోధ్యకు వెళ్లనున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కోనసీమలోని మండపేట నుంచి ఈ కొబ్బరిబోండాలను చూడవచ్చు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం రోజు వినియోగించేందుకు ప్రత్యేకంగా వీటిని తయారు చేశారు. కోనసీమ కొబ్బరిబోండాలకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడి నుంచి అయోధ్యలోని సీతమ్మ ఆశ్రమం అభ్యర్థన మేరకు శంకు, చక్ర, నామాలతో రూపొందించిన కొబ్బరి బోండాలను రామ మందిర ప్రారంభోత్సవానికి పంపారు. మండపేటకు చెందిన మహాలక్ష్మి, రామారెడ్డి దంపతులు ఈ కొబ్బరి బోండాలను ప్రత్యేకంగా తయారు చేసి పంపారు.
ప్రత్యేకంగా తయారు చేసి…
అయోధ్య మండపేట నుంచి కొబ్బరి బోండాలు పంపాలని కోరడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈరోజు కొబ్బరి బోండాలు అయోధ్యకు చేరుకుంటాయని చెప్పారు. శ్రీసీతారాముల కల్యాణ వేడుకలో మండపేటకు చెందిన కొబ్బరి బోండాలను వినియోగించడం మనకు గర్వకారణమని వారంటున్నారు. కోనసీమ కొబ్బరి బోండాలు పంపమని కోరడమే తాము చేసుకున్న పూర్వ జన్మ సుకృతమని చెబుతున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కోనసీమ కొబ్బరి బోండాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *