సిరా న్యూస్,నిర్మల్:
అయ్యప్ప దీక్షాపరుని ఆత్మహత్య
అయ్యప్ప మాల ధారణ చేసిన అయ్యప్ప స్వామి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్ కాలనీకి చెందిన అంబల సురేష్ స్థానిక మంచిర్యాల్ చౌరస్తాలో ఎస్ బేకరీ నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్ల క్రితం బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్నగర్ నుంచి నిర్మల్కు వలస వచ్చాకె, 22 ఏళ్లుగా అయ్యప్ప మాలను ధరిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 6 గంటలకు తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతసేపైనా బయటికి రాకపోవడంతో కిటికీ నుంచి చూడగా ఊరివేసుకొని ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఫోన్ను పరిశీలించగా .. ఆరోగ్య సమస్యలు భరించలేక చనిపోతున్నట్లు వాయిస్ మెసేజ్ పెట్టారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శంకర్ వివరించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.