Azad: 25,26 తేదీల్లో అఖిల భారత విద్యార్థుల సదస్సులు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
25,26 తేదీల్లో అఖిల భారత విద్యార్థుల సదస్సులు
* అఖిలభారత విద్యార్థిల ఆర్గనైజేషన్ కమిటీ సభ్యుడు ఆజాద్
* గోడపత్రాలు ఆవిష్కరణ
హైద‌రాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 25,26 తేదీలో నిర్వ‌హించే అఖిల భారత విద్యార్థుల సదస్సును విజయవంతం చేయాలని అఖిలభారత విద్యార్థిల ఆర్గనైజేషన్ కమిటీ సభ్యుడు ఆజాద్ అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్ల‌బ్‌లో సదస్సుకు సంబంధించిన గోడపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జాతీయ విద్యా విధానాన్ని, ఎన్ ఈ పి 2020ను రద్దు చేయాలని అన్నారు. ఉమ్మడి శాస్త్ర విద్యా విధానం అమలు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బోధన బోధననేతర ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలని, విద్యాయాలన్నిటిలో లింగ సామాజిక న్యాయం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బి రాహుల్, శ్రవణ్ , గణేష్ , విక్రం , నవీన్ కుమార్, సుజయ్ సత్యనారాయణ , సాయికుమార్, ఇఫ్తార్ ఖాన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *