B Hussain: లోక్ అదాలత్  ద్వారా సత్వర న్యాయం : మున్సిఫ్ మెజిస్ట్రేట్ బి హుస్సేన్

సిరా న్యూస్, బోథ్‌
లోక్ అదాలత్  ద్వారా సత్వర న్యాయం : మున్సిఫ్ మెజిస్ట్రేట్ బి హుస్సేన్

లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను రాజీ కుదుర్చుకొని సత్వర న్యాయం పొందవచ్చని మున్సిఫ్ మెజిస్ట్రేట్ బి హుస్సేన్ అన్నారు.
శనివారం జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో ఆయ‌న మాట్లాడారు. కక్షిదారులు కేసులను రాజీ కుదుర్చుకోవడం వల్ల విలువైన సమ యాన్ని, డ‌బ్బును ఆదా చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. చిన్న చిన్న తప్పులు చేసి కేసుల్లో ఇరుకొని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని కోరారు. లోక్ అదాలత్‌లో బ్యాంకు అదాలత్ ద్వారా 36 కేసులను పరిష్కరించడం జరిగింద‌ని తెలిపారు. అంతేగాక 18 ఎస్ టి సి, 103 ఎక్సైజ్ 51 రాజీవ్ మార్గం ద్వారా కేసులను పరిష్కరించడం జరిగింద‌ని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్ రావు దేశ్ పాండే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీధర్ , న్యాయవాదులు సుభాష్, మోహన్ రావు, పంద్రం శంకర్, ఆడేపు, హరీష్, కుమ్మరి విజయ్ కుమార్, జమీర్, ధర్మపాల్, బోథ్‌ ఎస్సై బి రాము, బ‌జార్‌హ‌త్నూర్‌ ఎస్సై నరేష్ , కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *