సిరా న్యూస్,చిగురుమామిడి
చిగురుమామిడి మండల ప్రత్యేక అధికారిగా బి నరేందర్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రత్యేక అధికారిగా బి నరేందర్ గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.కరీంనగర్ జిల్లా వెటర్నిటీ పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారిగా ఆయన పనిచేస్తున్నారు. జడ్పీటీసీ , ఎంపీటీసీల పదవి కాలం పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతీసుకున్న విషయం తెలిసిందే.స్థానిక సంస్థల్లో కులగణన చేపట్టేంత వరకు ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంలో సుమారు 6 నెలల వరకు మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.