సిరా న్యూస్, ఆదిలాబాద్
విద్యాసంస్థలు బంద్ విజయవంతం : విద్యార్థి సంఘాలు జేఏసీ కన్వీనర్ బి రాహుల్
విద్యాసంస్థలు బంద్ విజయవంతమైందని ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి సంఘాలు జేఏసీ కన్వీనర్ బి రాహుల్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ లీకేజీ పై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పేపర్ లీకేజీ పై నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని తెలిపారు.దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్,ఇతర వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చిన నీట్-యూజీ ఎంట్రన్స్ సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్న దేశ ప్రధాని మోదీ స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. బిహార్ లో రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్రయించారని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (నీట్) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు శాంతన్ రావు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సాయికుమార్, ఏఐఎఫ్డీఎస్ జిల్లా అధ్యక్షులు కుంటల నవీన్ కుమార్ ,ఏఎస్యూ ప్రధాన కార్యదర్శి అశోక్, ఎస్వీఏ జిల్లా అధ్యక్షులు సుజయ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు హరీష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కేశవ్, పి డి ఎస్ యు వినోద్ కుమార్, విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.