సిరాన్యూస్, తలమడుగు
బాలికల భద్రతే షీ టీమ్ లక్ష్యం : షీ టీం సభ్యురాలు బి. సుశీల
బాలికల భద్రతే షీ టీమ్ లక్ష్యమని షీ టీం సభ్యురాలు బి. సుశీల అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం షీ టీమ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సందర్భంగా షీ టీం సభ్యురాలు బి. సుశీల మాట్లాడుతూ పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేయాలని తెలిపారు. విద్యార్థులు ఫోన్లో ఎక్కువగా వాడకూడదన్నారు. ఫోన్లో ఏమైనా మెసేజ్లు గాని ఏదైనా కొత్త యాప్లు గాని డౌన్లోడ్ చేయకూడదని తెలిపారు. మనకు తెలియని యాప్లను డౌన్లోడ్ చేసుకొని మన పర్సనల్ డేటా షేర్ చేసి ఇబ్బందులు గురికావద్దని సూచించారు. బాలికలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేద నకు గురికాకూడదని మంచి ఆలోచనతో చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై కూడా దృష్టి సారించాల న్నారు. క్రమశిక్షణతో ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినులు 170 మంది, షీ టీం బృందం సత్యమోహన్లు పాల్గొన్నారు.