సిరా న్యూస్,పుట్టపర్తి ;
శ్రీ భగవాన్ సత్య సాయి బాబా గారికి అత్యంత సన్నిహితులు ప్రొఫెసర్ అనిల్ కుమార్ భౌతికాయనికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనిల్ మరణ వార్త ను తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె పుట్టపర్తి లోని చిత్రావతి రోడ్డు లోనీ అనిల్ కుమార్ నివాసానికి విచ్చేసి అయన భౌతికాయనికి నివాళి అర్పించారు. అక్కడ నుంచి వైకుంఠ రథం వరకు అనిల్ కుమార్ పాడే మోశారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ,
సత్యసాయి బాబా అనువాదకుడు అనిల్ కుమార్ అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు అని కొనియాడారు. సత్యసాయి సేవలో తరించిన ధన్యజీవి అనిల్ కుమార్ గత 50 సంవత్సరాలుగా స్వామి వారి దర్శన,స్పర్శన,సంభాషణ, తో పాటు స్వామి వారితో భారతదేశంలో దక్షిణ భారత, ఉత్తర భారతంలో పర్యటించిన వ్యక్తి అనిల్ కుమార్ అని కొనియాడారు. సుమారు దాదాపు 40 దేశాలలో పర్యటించి సత్యసాయి బాబా వారి సందేశం వినిపించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారనీ అయన పేర్కొన్నారు.
పలువురు భారత రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు ఆయన ప్రసంగాలను ఆసక్తిగా విని ముగ్ధులయ్యారనీ తెలిపారు.ఆంగ్లంలో మంచి వక్తగా ,విద్యావేత్తగా, పుస్తక రచయితగా అయన రాణించారనీ తెలిపారు. రష్యన్, జపనీస్, ఆస్ట్రేలియా దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా లక్షలాదిమంది సాయి భక్తులు చివరిగా… నాలాంటి అతి సామాన్యమైన వ్యక్తిని… ఎంతో ప్రేమగా పేరు పెట్టి పిలిచి ఆప్యాయత పంచేవారనీ కొనియాడారు
అందరిని తన మాట వాక్చాతుర్యంతో కట్టిపడేసే అనిల్ కుమార్ మన మధ్య భౌతికంగా లేకపోయినా ప్రజల్లో గుండెల్లో శాశ్వతంగా ఉంటారని తెలిపారు.
అనిల్ కుమార్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అయన దేవుణ్ణి ప్రార్థించారు.మాజీ మంత్రి తో పాటు టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ , శ్రీరామ్ రెడ్డి, మహమ్మద్ రఫీ, పుల్ల ప్ప, దేవనాథ్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
=====================X