సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమశిల జలాశయం ఆయకట్టు రెండో పంట పేరుతో సుమారు 30 టీఎంసీల నీటిని వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అయినా అంబటి రాంబాబు కనీసం వృధా అయిన నీటిపై ఒక్క సమీక్ష నిర్వహించకపోవడం విస్మయానికి గురి చేసిందన్నారు. తుఫాన్ గ్రామంతో అనేక గ్రామాలు విలవిలలాడితే నష్టపరిహారం చెల్లించడంలో గిరిజనులకు దళితులకు బీసీలకు పరిహారం అందలేదన్నారు. దళితులపై బీసీలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాపాట ప్రేమ తప్ప నిజమైన ప్రేమ లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు.