ఇంటింటా ప్రచారం భాగంగా టిడిపి నాయకులు
సిరా న్యూస్,నందవరం;
మండల పరిధిలోని ఇబ్రహీంపురం గ్రామంలో ఇంటింటా ప్రచారం భాగంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధవస్వామి దేశాయ్ కాసిం వలి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు బీవీ జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని ఇంటింటా ప్రచారంలో నారా చంద్రబాబునాయుడు మేనిఫెస్టో లో సూపర్ సిక్స్ పథకాలు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు గమనించి రాష్ట్రం బాగుండాలి అంటే నారా చంద్రబాబునాయుడుని గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు మండల కన్వీనర్ చిన్న రాముడు, రైస్ మిల్ నారాయణరెడ్డి, ధర్మపురం గోపాల్, నరసింహులు,టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.