తండ్రిపై దాడి చేయించిన తనయుడు
సిరా న్యూస్,హైదరాబాద్;
ఆస్తి కోసం కన్న కొడుకే ఓ వృద్ధ తండ్రి పై దాడి చేయించాడు. తన కొడుకు కోడలు, వారి బంధువుల నుండి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని బాధిత తండ్రి కళ్లెం నర్సింహా రెడ్డి తెలంగాణ డిజిపి ని కలిసి వేడుకున్నాడు. హైదరాబాద్ దోమలగూడ కి చెందిన కళ్లెం నర్సింహా కొడుకు చంద్ర శేఖర్ రెడ్డి , కోడలు పద్మలతలు ఆస్తి కోసం పద్మలత తన బావ అయిన కొంపల్లి కి చెందిన SVR గార్డెన్స్ యజమాని సాదా నర్సింహా రెడ్డి తో తన పై దాడి చేయించాడని బాధిత తండ్రి పిర్యాదు లో పేర్కొన్నాడు. మాజీ మంత్రి మల్లా రెడ్డి ప్రొద్భలంతో, అండతో ఆదివారం సాదా నర్సింహా రెడ్డి కుటుంబ గెట్ టూ గెదర్ ఉందని తనను పిలిపించి.. మల్లా రెడ్డి తో పాటు మరో పది మంది పెద్దల సమక్షంలో తన పై తీవ్ర పదజాలంతో దుర్భాదలడుతూ తల పై దాడి చేసి చితక బాదాడని తెలిపాడు. దీంతో తాను రెండు రోజులు అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందానని చెప్పారు. తన కొడుకు కోడలు ఆస్తి కోసం తాను ఇస్తానని చెప్పినా కూడా వినకుండా నాపై ఆకారణంగా దాడి చేసి బెదిరించాడని అన్నాడు. తనకు తన కొడుకు, కోడలు, సాదా నర్సింహా రెడ్డి ల నుండి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించేలా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ కళ్లెం నర్సింహా రెడ్డి వేడుకుంటున్నాడు.