సిరా న్యూస్, కుందుర్పి
కిడ్నీబాధితుడికి రూ.30వేలు అందజేసిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామానికి చెందిన వన్నూరక్క భర్త అయిన దేవరాజ్ సంవత్సరం నుండి కిడ్నీ వెన్నపూస వ్యాధితో బాధ పడుతున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. వీరు రోజు వారి కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. అకస్మాత్తుగా కిడ్నీకి ఇన్ఫెక్షన్ రావడంతో పనికి వెళ్లలేక రోజు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పూట గడవడం కష్టంగా మారింది. దేవరాజు కు ఆపరేషన్ చేయాలని మూడు నెలల క్రితం డాక్టర్లు సూచించారు. ఆసుపత్రికి వెళ్ళడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ బద్దేనాయక్ రాత్రి ఫోన్ చేసి తమ బాధను తెలిపారు. ఉదయాన్నే వారి ఇంటికి చేరుకొని మానవతా దృక్పథంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ తన సొంత నిధులు 30,000/- ఇచ్చి ఆపరేషన్ కోసం కర్నూలు కు పంపించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.