సిరా న్యూస్,కళ్యాణదుర్గం
చిన్నారి వైద్యం కోసం ఆర్థిక సాయం
ఓ చిన్నారి వైద్య చికిత్స కోసం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆర్థిక సాయంచేశారు. ఆ సంస్థ కార్యాలయం లో ట్రస్ట్ సభ్యుల తో కలిసి బాధిత చిన్నారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేశారు. వివరాల్లోకెళ్తే…కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఎరుకుల రామలక్ష్మి కుమారుడు ఎరుకుల వేణు యూరినల్ సమస్యతో బాధ పడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు వెళ్లాలని వైద్యులు సూచించగా వైద్య ఖర్చులకు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ఆ కుటుంబ సభ్యులకు రూ.20వేల చెక్కును అందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కరణం రాము,శెట్టూరు మండలం ఎం. ఎస్ హనుమంతరాయుడు, బ్యాంక్ ఉద్యోగి లోకేష్, సూర్య టెక్స టైల్స్ యజమాని సురేష్, ఉపాద్యాయుడు తిప్పేస్వామి, రవికుమార్ తదితరులు ఉన్నారు.