బద్వేలు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధా కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి లను భారీ మెజార్టీతో గెలిపించండి

ఇంటింటి ఎన్నికల ప్రచారం లో బద్వేలు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి
 సిరా న్యూస్,బద్వేలు;

బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని గోపవరం మండలం బ్రాహ్మణ పల్లె గ్రామ పంచాయతీ సూరేపల్లి, వడ్డే పాలెం, దళితవాడ, ఓబుల్ రెడ్డి నగర్, అడుసు వారి పల్లె గ్రామంలో బద్వేల్ మాజీ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఇంటికి వెళ్లి ఓట్లు అడిగారు బద్వేలు వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి లకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం జగనన్న ప్రతి మహిళనూ ఆర్థికంగా శక్తిమంతులుగా చేశారు, ప్రతి గ్రామము అభివృద్ధి చేశారు. స్కూల్స్, హాస్పిటల్స్, విలేజ్ సెక్రటేరియట్స్,ఆర్బీకే సెంటర్స్,వెల్నెస్ సెంటర్స్ ఇలా అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించారు.. ఇవి అభివృద్ధి కాదా..? ధనిక,పేద అన్న తేడా లేకుండా అందరికీ ఒకే విధం అయిన విద్య అందించాలి అని ఈ ప్రభుత్వం సంకల్పించింది ఇంటింటికి వెళ్లి మే-13 వ తేదీనా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి, జగనన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగేందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థురాలు సుధమ్మ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించి ఎమ్మెల్సీ డిసిగోవిందరెడ్డి కోరారు

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి , మండలం కన్వీనర్ మల్లికార్జున్రెడ్డి, సర్పంచ్ లక్ష్మీదేవి, రమణారెడ్డి, సింగల్ విండో చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, పాపుదీపు కొండారెడ్డి, కలువ వెంకటేశ్వర రెడ్డి,కొండారెడ్డి , జేఏసీ కన్వీనర్ పుల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ, మల్లంకొండ చైర్మన్ గోవిందరెడ్డి, గంగనపల్లి గంట రమణారెడ్డి, హరికృష్ణ రెడ్డి, రాళ్లపల్లి నరసింహులు, రవిచంద్ర రెడ్డి, నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..
=======================xxx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *