సిరా న్యూస్,శ్రీకాకుళం;
తెలుగుదేశం పార్టీ పాతపట్నం అభ్యర్థిగా మామిడి గోవింద రావు ను వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని, కేడర్ ను కాపాడుకుంటూ వచ్చిన కలమట వెంకటరమణ మూర్తి కి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అన్యాయం చేసిందని, ఎవరో ఆచూకీ లేని వ్యక్తికీ టికెట్ కేటాయిస్తే సహకరించే సమస్యే లేదని తేల్చిచెపుతూ ఆందోళన చేస్తూ తెలుగుదేశం పార్టీ కరపత్రాలను మంటల్లో తగలపెట్టారు. కలమటకు టిక్కెట్ ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కనిపించని వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థత్వాన్ని వ్యతిరేకీస్తూ మండలంలో మండల నాయకులు, కార్యకర్తలు పార్టీ పదవులకు రాజీనామాలు చేసారు. ..
======================