మైలవరం పోలీస్ స్టేషన్ ముందు బైటాయింపు

                                                                          సిరా న్యూస్,మైలవరం;

సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలు మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు ఒక్కసారిగా రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దాంతో ట్రాఫిక్ స్థంభించింది. అంగన్వాడీలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. వారిని నిలువరించలేక పోలీసులు సతమతమయ్యారు. సీఐ మోహన్ రెడ్డి రంగప్రవేశం చేసారు. పోలీసులను కొడతారా అంటూ అంగన్వాడీ ఉద్యోగులు, సీఐటీయూ నాయకుల పై మండిపడ్డారు. మహిళా పోలీసులకు అలవి కాకపోవడంతో సీఐ,ఎస్సై కలిసి మహిళలను వాహనం ఎక్కించి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *