ఆదిలాబాద్, సిరా న్యూస్
ఆధ్యాత్మిక చింతనతోనే మంచి ఫలితాలు
బాజీ రావు బాబా భక్తుల ఆరాధ్య దైవమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ చార్జి కంది శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ దరి గ్రామంలో నిర్వహించిన బాజీరావు బాబా సప్తాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో భజనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ బాజీరావు బాబా బోధనలు భక్తులకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన సూచించిన భక్తి మార్గంలో ఎంతో మంది భక్తులు నడుస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరిలో ఆద్యాత్మిక చింతన కలిగించిన వారిలో ఆయన ముఖ్యులన్నారు. చెడు వ్యసనాలు వైపు మళ్లకుండా భక్తి భావంలోనే తరలించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు.