సిరా న్యూస్, బేల:
పొన్నాలలో ఘనంగా సప్త ముగింపు వేడుకలు…
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పొన్నాల గ్రామంలో సంత్ సద్గురు బాజీరావు బాబా సప్త ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఈ మేరకు బాజీరావు బాబా పల్లకితో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. బంతిపూలతో అలంకరించిన పల్లకిలో బాబా చిత్రపటాన్ని ప్రతిష్టించి భక్తుల దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు. వారం రోజులుగా సప్త కార్యక్రమం కొనసాగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా భవ్య జ్ఞానేశ్వరి పారాయణం, ప్రవచనాలు, భజనలు, గావించారు. మండలంలోని పలు గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు సప్త ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల దహి హండి, మహాన్నదానం గావించారు. కాగా గత 24 సంవత్సరాలుగా గ్రామంలో బాజీరావు బాబా సప్త వేడుకలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో యావత్ గ్రామం బాజీ రావు బాబా నామస్మరణతో మార్మోగింది.