సిరాన్యూస్, బేల
పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రణాళికలు: పీఏసీఎస్ చైర్మన్ బాల్ చందర్
* మండలంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ బాల్ చందర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డ్ లో రైతు భరోసా పైన రైతుల అభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం మండలంలోని రైతులతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుల నుంచి రైతు భరోసా కు సంబంధించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. కొందరు రైతులు మాట్లాడుతూ 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, గ్రామాల్లో వెంచర్లు చేసిన వాటికి, ఎకరాలకు ఎకరాలు పడావుగా ఖాళీ గా ఉన్న భూములకు రైతు భరోసా సాయం అందించవద్దని సూచించారు. కొందరు రైతులు మాట్లాడుతూ.. రైతులకు బోనస్ ఇవ్వాలని అన్నారు. భారాస హయాంలో బంజరు భూములకు గుట్టలకు, రాళ్లు రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వేసిన స్థలాలకు, జాతీయ రహదారులకు ఇచ్చిన భూములకు పథకం నిధులను ఇచ్చి కోట్లు ప్రజాధనాన్ని దుబారా చేశారని, ఈ ప్రభుత్వం నైనా రైతు భరోసా ను ఆదర్శవంతమైన పథకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు.