సూర్యపేట, సిరా న్యూస్
బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా పూజలు
సూర్యపేట జిల్లా కొండాయిగూడెం గ్రామంలో అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అన్నదానం చేశారు. ప్రసాదాలు వితరణ చేశారు. రాముడి ప్రాణ ప్రతిష్ట ను పురస్కరించుకుని గ్రామస్తులు పలు కార్యక్రమాలు చేపట్టారు. దశాబ్దాల కల నెరవెేరుతున్న వేళ సంతోషంగా పండగలా జరుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.