సిరా న్యూస్, జైనథ్:
సాంగ్వి లో బాలవికాస వాటర్ ప్లాంట్ ప్రారంభం…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాంగి గ్రామంలో బాలవికాస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను సర్పంచ్ విఠల్ రెడ్డి ప్రారంభించారు. బాల వికాస స్వచ్చంద సంస్థ ప్రతినిధి ప్రసూన్ రెడ్డితో కలిసి శుక్రవారం ఈ మేరకు ప్లాంట్ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలను శుద్దమైన తాగు నీరు అందించాలనే సంకల్పంతో బాల వికాస స్వచ్చంద సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు శ్లాఘనీయమన్నారు. తమ గ్రామానికి వాటర్ ప్లాంట్ ను మంజూరు చేసినందుకు గాను ప్రతేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవిదాస్, స్థానిక నాయకులు గాలెన్న, బొల్లి అశోక్, సామ లింగారెడ్డి, పురుషోత్తం రెడ్డి, అభిలాష్, బొంత సాయి, ఆకుల నాగన్న, భోయర్ నితిన్, తదితరులు పాల్గొన్నారు.