జైనథ్, సిరా న్యూస్
చెన్నూర్ సభలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జైనథ్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు అంతర్రాష్ట్ర రోడ్డుపై బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు గడ్డం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక సీఎం అని మర్చిపోయి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా చట్టరీత్యా బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాల్క సుమన్ తీరు అసమంజసంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గడ్డం జగదీష్ రెడ్డి సురేష్ రెడ్డి అశోక్ రెడ్డి సుదర్శన్, జగదీశ్ రెడ్డి, పిడుగు స్వామి, యాదవ్ పాల్గొన్నారు.