సిరా న్యూస్, సొనాల
చలివేంద్రం ప్రారంభించిన బలరాం జాదవ్
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం తెలంగాణ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాబ్లే సంతోష్ సింగ్ సమాజసేవలో ఎల్లప్పుడూ ముందుంటారు. ప్రతీ సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మండలానికి వచ్చే వారి దాహాన్ని తీర్చడం అభినందనీయమని అన్నారు.