హర్షం వ్యక్తం చేస్తున్న సింగరేణి కార్మికులు
సిరా న్యూస్,కమాన్ పూర్;
సింగరేణి సంస్థ ఛైర్మన్ గా బలరామ్ నాయక్ కు ప్రభుత్వం నియమించింది. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవి కాలం ముగియడంతో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన స్థానంలో బలరాం నాయక్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాలరామ్ నాయక్ సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బలరాం నాయక్ సింగరేణి ఫైనాన్స్ అండ్ వెల్ఫేర్ బాధ్యతలతో పాటు సీఎండీగా అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు. శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా ఉన్నారు. సింగరేణి చరిత్రలో 9 ఏళ్ల పాటు సుధీర్ఘంగా కొనసాగిన సీఎండీగా రికార్డు సాధించారు.
శ్రీధర్ హయాంలో సింగరేణి అనేక విజయాలు సాధించడంతో విమర్శలు కూడా ఎదుర్కొంది. కేంద్రం శ్రీధర్ వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీధర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం అతన్ని కొనసాగించింది. బలరాం నియామకం పట్ల సింగరేణి సంస్థ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సెంట్రల్ కమిటీ సభ్యుడు అంబేద్కర్ అవార్డు గ్రహీత ఇరుగు రాళ్లశ్రీనివాస్ గంగారపు వెంకటేశ్వర్లు ఇవి చవాన్ కుమార్ బత్తుల శంకర్ హర్షం వ్యక్తం చేశారు.