సిరాన్యూస్, జైనథ్
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
* డీసీసీబీ డైరెక్టర్ బాలురి గోవర్ధన్ రెడ్డి
* అభివృద్ధి పనులకు భూమి పూజ
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని డీసీసీబీ డైరెక్టర్ బాలురి గోవర్ధన్ రెడ్డి అన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కామాయి గ్రామంలో 6 లక్షల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి భూమిపూజ చేసారు.సీసీరోడ్డు ,డ్రైనేజీల పనులను ప్రారంభించారు.కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇందుకోసం దాదాపు 5కోట్లకు పైగా నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజా పాలన సాగిస్తుందన్నారు. గ్రామంలో ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి,గిమ్మ సంతోష్,అల్లూరి భూమ రెడ్డి, యాల్ల పోతా రెడ్డి, బాయిన్ వార్ గంగ రెడ్డి, మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ మునిగేల విట్టల్, మాజీ సర్పంచ్ వైద్య ఉమేష్, గూడ మాజీ సర్పంచ్ నిమ్మల ప్రభాకర్, బాలూరి కిష్టా రెడ్డి, కేతిరెడ్డి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి ప్రవీణ్ రెడ్డి,బెజ్జేరపు రాజు, దుర్ల వసంత్, నర్ర విట్టల్, మామిడి వెంకట్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.