Baluri Govardhan Reddy: రాజకీయాల్లో కక్ష్య సాధింపు ధోరణి సరికాదు…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

రాజకీయాల్లో కక్ష్య సాధింపు ధోరణి సరికాదు…

గెలిచిన ప్రజాప్రతినిధులు కక్ష్యసాధింపు ధోరణితో వ్యవహరించడం సరికాదనీ కాంగ్రేస్‌ నాయకులు, డీసీసీబీ డైరెక్టర్‌ బాలూరి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం లాండ సాంగి గ్రామంలో ఈజీఎస్‌ నిధులు రూ. 3లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు ఓట్లు వెయ్యలేదని కొన్ని గ్రామాలపై ఆదిలాబాద్‌ మాజీ ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలతో అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ఆదిలాబాద్‌కు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న లాండ సాంగి గ్రామంలో అభివృద్ధి చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం మంత్రి సీతక్క కేటాయించిన ఈజీఎస్‌ నిధులతో కాంగ్రేస్‌ పార్టీ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో నియోజక వర్గంలోని గ్రామాల్లో రూ. 5కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుల కిషన్, కొండురి రవి, ముకిం, సుదర్శన్, గజానంద్, విఠల్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *