సిరా న్యూస్, ఆదిలాబాద్
యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
* డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి
* దాల్ మిల్లు సందర్శన
యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాందా(టి) వద్ద యువకులు దాల్ మిల్లును ప్రారంభించారు.ఈ మిల్లును డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. అనంతరం సమాచారం సేకరించారు. యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు కల్పించే విధంగా ఆలోచించాలన్నారు.ఈసందర్భంగా రామన్న, కిరణ్ చందా ప్యాక్స్ చైర్మన్ రవి మోకింలకు అభినందనలు తెలిపారు .