Baluri Govardhan Reddy: జాతీయస్థాయిలో రాణించాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్:

జాతీయస్థాయిలో రాణించాలి

-బాలురి గోవర్ధన్ రెడ్డి..

అదిలాబాద్ జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలురి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైన ఇషాంత్ రెడ్డి, ఓం కిరాజ్ రెడ్డి లను ఆదివారం ఆయన శాలువతో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏప్రిల్ లో రాంచీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ నుంచి జిల్లా కు చెందిన ఇద్దరు క్రీడాకారులు పాల్గొనడం గర్వకారణం అన్నారు. ఆల్ ఇండియా స్థాయి పోటీల్లో సైతం క్రీడాకారులు రాణించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీ దయానంద్ రెడ్డి, నరోత్తం రెడ్డిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *