సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ లో ఆస్ట్రో టర్ఫ్ కోర్ట్ ఏర్పాటుకు అవకాశం
* ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి
* స్టేడియం పరిశీలన
ఖేలో ఇండియా సెంటర్ ఏర్పాటు కు ఆదిలాబాద్ జిల్లా ఎంపిక కావడం అభినందనీయమని ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా స్టేడియంలోని హాకీ కోర్టును తొలగించారని, వాటి పునర్ నిర్మాణానికి పనులు ప్రారంభమైనందున శుక్రవారం పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఈ సెంటర్ ఉన్న చోట 8 కోట్ల చొప్పున ఆస్ట్రో టర్ఫ్ కోర్ట్ ఏర్పాటు చేయనున్నారని, దీనిలో భాగంగా ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆస్ట్రో టర్ఫ్ కోర్ట్ ఏర్పాటు కు కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కు అక్కడి నుండి కేంద్ర ప్రభుత్వం కు త్వరలో ప్రతిపాదనలు పంపడం జరుగుతోందని తెలిపారు.హాకీ కోర్టును పునర్ నిర్మాణం చేపడుతున్నందున ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు బదిలీపై వెళ్లే కలెక్టర్, ప్రస్తుత కలెక్టర్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఖేలో ఇండియా లో భాగంగా దేశంలో ఉన్న సెంటర్లలో ఆస్ట్రో టర్ఫ్ కోర్ట్ ఏర్పాటు చేయడానికి 8 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేయడం జరుగుతుందని, ఇది ఆదిలాబాద్ ఇందిరా ప్రదర్శన స్టేడియంలో ఏర్పడితే గచ్చిబౌలి స్టేడియం మాదిరిగానే, ఇందిరా ప్రియ ప్రదర్శని స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కోచ్ శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.