సిరా న్యూస్, జైనథ్:
జోగు రామన్న వల్లనే మార్కెట్లో కఠిన నిబంధనలు
– సోయా కొనుగోళ్లు ప్రారంభించిన బాలూరి గోవర్ధన్ రెడ్డి
– మాజీమంత్రి జోగు రామన్న పై ఫైర్
– కొనుగోళ్లకు అనుమతులు తెచ్చిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు అభినందనలు
మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షులు జోగు రామన్న వాళ్ళనే నేడు మార్కెట్ లో నిబంధనలు కఠినంగా మారాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు, డిసిసిబి డైరెక్టర్ బాలురు గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోళ్లను పున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత నెలలో ప్రారంభమైన సోయా కొనుగోళ్లు కొన్ని టెక్నికల్ కారణాలతో ఆగిపోయాయని అన్నారు. మరల నాఫెడ్ అధికారులకు స్థానికంగా రైతుల ఇబ్బందులను గురించి తెలియజేయడంతో ప్రస్తుతం సోయా కొనుగోళ్లకు అనుమతులు లభించాయని అన్నారు. కేవలం ఒక్కరోజులోనే సోయా కొనుగోళ్లకు కేంద్రం నుండి అనుమతులు తెచ్చిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఆయన ఈ సదర్భంగా అభినందించారు. రైతులకు ఎలాంటి పార్టీలు ఉండవని, రైతుల సంక్షేమం కోసం పాటుపడే ప్రతి ఒక్కరిని అభినందిస్తామని ఆయన అన్నారు. కాగా ఇటీవల కొంత మంది బిఆర్ఎస్ నాయకులు పంటల కొనుగోళ్ల కోసం మండల కేంద్రంలో ధర్నా చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం సొంత బంధువుల వద్ద నుండి రూ. 50 వేలు వసూలు చేసిన ఓ బిఆర్ఎస్ నాయకుడు, ఏఎంసీ చైర్మన్ పదవిని రూ. 20 లక్షలకు కొనుక్కున్న మరో నాయకుడు ధర్నా చేయడం హాస్యస్పమని అన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న మార్కెట్ చైర్మన్ పదవులు అమ్ముకున్నారని ఘాటు విమర్శలు చేశారు. గతంలో జోగు రామన్న కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతోనే మార్కెట్లో నిబంధనలు కఠిన తరం చేయడం జరిగిందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు. మండలంలో దాదాపు 25 వేల క్వింటాళ్ల సోయలు రైతుల వద్ద ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని, జిల్లావ్యాప్తంగా సుమారు 1.20 లక్షల క్వింటాళ్ల వరకు సోయలు రైతుల వద్ద నిలువ ఉన్నట్లు తెలిపారు. రైతుల వద్ద ఉన్న సోయాలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని, రైతులు ఈ అరు కూడా ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొడిచెర్ల సుదర్శన్, నాయకులు గడ్డం జగదీశ్ రెడ్డి, అల్లూరి అశోక్ రెడ్డి, సురేష్ రెడ్డి, లస్మన్న, స్వామి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.