సిరాన్యూస్, ఖానాపూర్
ఇండియా కూటమిని ఆదరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు: బానవత్ గోవింద్ నాయక్
ఇండియా కూటమిని ఆదరించిన ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఛైర్మెన్ బానవత్ గోవింద్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బాణావత్ గోవింద నాయక్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి దేశ ప్రజలు ఈ ఎన్నికలలో తగిన బుద్ది చెప్పారన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ అభ్యున్నతికి పని చేస్తామని చెప్పిన ఇండియా కూటమికి ఒక మంచి సంఖ్యలోకి సభ సీట్లు గెలిపించిన దేశ ప్రజలందరికీ ధన్యవాదములు తెలిపారు.