సిరాన్యూస్, ఖానాపూర్
విలేఖరిని బెదిరించిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలి: బాణావత్ గోవింద్ నాయక్
విలేఖరిని బెదిరించిన వ్యక్తీ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల నవతెలంగాణ పత్రిక విలేఖరి లక్ష్మీ నారాయణ ను చంపేస్తా అని బెదిరించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈరోజు ఇతను రేపు ఇంకొకరు ఇలా విలేకరులను బెదిరిస్తూ పోతే వాళ్లు ప్రభుత్వానికి ప్రజలకు సారధిగా ఉంటూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో తమ పని తాము చేసుకుంటూ పోతే ఇలా అని ప్రశ్నించారు. బెదిరించడం దానికి ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. అక్రమ చెరువులో మొరం తరలింపు పై యధేచ్చగా మట్టి, మొరం దందా అనే “శీర్షిక” రాస్తే అక్రమ తవ్వకాల కు పాల్బడిన మాజీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ అహ్మద్ అనే వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల జర్న లిస్ట్ సంఘాలతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని గోవింద్ నాయక్ అన్నారు.