సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
గోర్ బంజారా సమ్మేళనం విజయవంతం చేయడం: బాణావత్ గోవింద నాయక్
జాతీయ గోర్ బంజారా సమ్మేళనం విజయవంతం చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద నాయక్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జాతీయ గోర్ బంజారా సమ్మేళనం విజయవంతం చేయడం కోసం ఈనెల 20న ఎల్ హెచ్ పి ఎస్, రాష్ట్రా ముఖ్యుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎల్ హెచ్ పి ఎస్, రాష్ట్ర, జిల్లా నాయకులు తప్పక హాజరు కావాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజవత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు హాజరవుతున్నట్లు తెలిపారు.