టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వకపోవడంతో అస్వస్థతకు గురైన బండారు సత్యనారాయణ మూర్తి

సిరా న్యూస్,పరవాడ;
విశాఖ,అనకాపల్లి జిల్లాలో టీడీపీలో బండారు ప్రజలలో మంచి పట్టుఉన్న నాయకుడు రాజకీయాలలో నాలుగు దశాబ్దాల కాలం పాటు టీడీపీలో పరవాడ, పెందుర్తి నియోజకవర్గాల ప్రజలకు ప్రజా సేవలు అందించారు. టీడీపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యే గా,ఒక సారి మంత్రిగా చేశారు తెలుగుదేశం పార్టీలో కోస్తాంద్రలో మంచి నాయకుడుగా బండారు ఏదిగారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు,పార్టీకి నమ్మిన విధేయుడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో తన యొక్క సేవలు అందించారు అటువంటి నాయుకుడుగా ఉన్న బండారు సత్యనారాయణ మూర్తి కు టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొన్ని సమీకరణాలు కారణంగా తనపేరును ప్రకటించకపోవడంతో బండారు తీవ్ర మనస్తపానికి గురవ్వడంతో బీపి, షుగర్ లేవల్స్ పెరుగుపోవడంతో ఆయన కుటుంబం సభ్యులు విశాఖలో ఓ ప్రవేటు ఆసుపత్రి లో ఆదివారం హుటాహుటిగా చేర్పించారు. విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్,మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి,పల్లా శ్రీనివాస్రావు తదితరులు బండారుని కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకొన్నారు. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడంతో ఆ పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే,జనసేన పార్టీ నాయకుడు పంచకర్ల రమేష్ బాబు పేరును కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *