సిరా న్యూస్,మచిలీపట్నం;
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ప్రశాంతంగా జరుగుతోంది. పలు దళిత సంఘాల ప్రతినిథులు బంద్ లో పాల్గొని నగరంలోని వర్తక, వాణిజ్య దుకాణాలను మూయిస్తున్నారు. తెల్లవారుజామునే ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న ఆందోళనకారులు డిపో నుండి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తన సిబ్బందితో ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని, ఉద్యోగాల్లో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత JAC నాయకుడు జక్కుల ఆనంద్ అన్నారు. వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలన్నారు.
======================