సిరాన్యూస్, చిగురుమామిడి
గంజాయి పట్టివేత : ఎస్ఐ బండి రాజేష్
* ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.…రిమాండ్ కు తరలింపు
చిగురుమామిడి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గంజాయిని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ బండి రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం… ఇందుర్తి, చిగురుమామిడికి చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి పట్టుబడిందని తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమండ్ కు తరలించినట్లు తెలిపారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిషేధిత గంజాయి కి సంబంధించిన సమాచారం ఉంటే 100 కి ఫోన్ చేసి తెలుపాలని సూచించారు.