సిరా న్యూస్, భీమదేవరపల్లి
భీమదేవరపల్లిలో ప్రారంభమైన ప్రజాహిత యాత్ర
కరీంనగర్ బీజేపీ పార్టీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తలపెట్టిన ప్రజాహిత యాత్ర మూడవ రోజు భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్బంగా ప్రజాహిత యాత్రలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, హనుమకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, మండల అధ్యక్షులు పృథ్విరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.