సిరాన్యూస్, ఇచ్చోడ
విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ : హెచ్ఎం బాపురావు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామిడీ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రభుత్వం నుంచి ఉచితంగా సరఫరా అయిన ఏకరూప దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బాపూరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుక్షితమైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను భోదించడం జరుతుందన్నారు. బడీడు వయస్సు కలిగిన వారిని బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు జతల ఏకరూప దుస్తులను ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంతో పాటు వారానికి మూడు సార్లు గుడ్లు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అన్నివిధాలా సదుపాయాలు కల్పిస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శేఖర్, షీలా రాణి, వనిత, అంగన్వాడి టీచర్, విద్యార్థులు పాల్గొన్నారు.