సిరా న్యూస్,తుగ్గలి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు శనివారం రోజున మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.రాష్ట్రంలో వెనుకబడిన బీసీల అభివృద్ధి కొరకు కృషి చేయాలని మంత్రిని కోరినట్లు బత్తిన వెంకటరాముడు తెలియజేశారు. అదేవిధంగా కర్నూలు జిల్లా మరియు పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి కొరకు కృషి చేయాలని మంత్రిని కోరినట్లు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు తెలియజేశారు.దీనిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సానుకూలంగా స్పందించినట్లు ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు టిడిపి రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకటరాముడు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.