సిరాన్యూస్, సైదాపూర్
బహిరంగ సభను విజయవంతం చేయండి: బత్తిని శ్రీనివాస్ గౌడ్
ఈనెల 6 తేదీన మహేశ్వరం కాన్స్టెన్సీ తుక్కుగూడ లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ఎలక్షన్ కోఆర్డినేటర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, మాజీ జెడ్పిటిసి గుండారం శ్రీనివాస్, రాఘవులు కొండాల్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఎల్జి రాజు, ప్రవీణ్, లక్ష్మణ్, ప్రేమ్ కుమార్, యాదగిరి, సంపత్,కిషన్ నాయక్, పెద్ది తిరుపతి, వెంకటేశం బీరయ్య తదితరులు పాల్గొన్నారు.