కుందుర్తి, సిరా న్యూస్
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో రేపు ఉదయం 10.30 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో బీసీ సభ ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా బయలుదేరి 11.00 గంటలకు పాత మార్కెట్ లో జయహో బీసీ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య ఆధ్వర్యంలో సాధికారిక సంఘ జిల్లా అధ్యక్షులు అందరు హాజరు అవుతున్నారు. నియోజకవర్గంలో వివిధ హోదాల్లో ఉండే బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.