సిరా న్యూస్,శ్రీకాకుళం;
బిసిల ద్రోహి చంద్రబాబు నాయుడు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జయహో బిసి కార్యక్రమం ఒక మోసం అని ఎద్దేవా చేసారు.ప్రజలెవరూ జయహో బిసి ని నమ్మవద్దు అన్నారు.ఎన్నికల సమయంలో బాబు కు బిసి లు గుర్తుకు వస్తారని,ఎన్నికల అనంతరం వారిని మర్చిపోతారు అని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో బిసిలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదన్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్నడూ బిసిలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు.చంద్రబాబు కరుడు కట్టిన బిసి వ్యతిరేకి అని ఆయన అభివర్ణించారు.జగన్ ప్రభుత్వం బిసిలకు రాజకీయ పరంగా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు.ఈ విషయం పై చర్చకు మేము సిద్ధం అని ధర్మాన సవాల్ చేశారు.