సైబర్ నేరస్తులతో జాగ్రత్తగా ఉండాలి..

రుణమాఫీ విషయంలో ఎలాంటి మెసేజ్లు ఫైల్స్ ఓపెన్ చేయవద్దు..
పోలీస్ కమిషనర్ డా. బి. అనురాధ
 సిరా న్యూస్,సిద్దిపేట;
రుణమాఫీ విషయంలో  ఏదైనా సమస్య ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడాలి.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఎదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగో తో వాట్స్ యాప్ లో పంపిస్తున్నారు.  దీన్ని మనము మన వాట్సప్ యాప్ వాళ్ళ కంట్రోల్ కీ వెళ్లి పోతుంది,  అంతే కాకుండా మన కాంటాక్ట్స్ లో వున్న ప్రతి ఒక్కరికి మరియు ప్రతి గ్రూప్ నకు  మెసేజ్ వెళ్ళ్తున్నది. దీని ద్వారా సైబర్ నేరస్థులు మన గూగుల్ పే, ఫోన్ ప్లే, యూపీఐ ద్వారా డబ్బులు దోచేస్తున్నారు.  ట్రెండింగ్ లో వున్న టాపిక్ ఋణ మాఫీ ద్వారా  డబ్బులు కొట్టేస్తున్నారు. కాబట్టి అందరికి మనవి చేసేది ఏమంటే ఏదయినా  మీరు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యకూడదు. మీ వాట్స్ యాప్ పనిచేయకుంటే వెంటనే తరిగి రిఇన్స్టాల్  చేసి ఆప్షన్ లో రిపోర్ట్ చెయ్యండి.  ఎవరైనా ఏదయినా నేరానికి గురి అయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా 1930 కీ కాల్ చెయ్యండి లేదా www.cybercrime.gov.in మెయిల్ చేయాలని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *