సిరా న్యూస్,కళ్యాణదుర్గం;
కళ్యాణదుర్గం మండలం, ఉప్పు వంక గ్రామం లోని అటవీ ప్రాంతం వద్ద రైతు పై రెండు ఎలుగుబంట్లు దాడి చేసాయి. ఈ దాడిలో రామన్న అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. తన పొలం లో వ్యవసాయ పనులకు పోతున్న రామన్న పై రెండు ఎలుగుబంట్లు దాడి చెయడం తో రామన్న తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.