సిరాన్యూస్, బేల
బేదోడాలో సీఎం రేవంత్రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
* ఘనంగా రైతు రుణమాఫీ సంబురాలు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బేదోడా గ్రామంలో రైతులతో కలిసి మాజీ సర్పంచ్ ఠాక్రె అశోక్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు.అనంతరం రైతులతో కలిసి స్వీట్లు పంచుకుని సంబురాలు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని, రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంతో రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతుల రుణమాఫీ జరగనందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని మిగితా రైతులకు కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కెమెకార్ సంతోష్, రావూత్ రాందాస్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.