నలబై మందికి గాయాలు
సిరా న్యూస్,శ్రీకాకుళం;
మందస రోడ్ రైల్వేస్టేషన్ లో తేనెటీగల దాడి ఘటనలో నలబై మందికి గాయాలు అయ్యాయి. భువనేశ్వర్ – విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు వచ్చే ముందు దాడి జరిగింది. తేనెటీగల దాడితో ప్రయాణికులు పరుగులుపెట్టారు. తేనెటీగల దాడితో ట్రైన్ ఎక్కలేక పలువురు ప్రయాణికులు వుండిపోయారు. మూడు రోజుల కిందట ఇదే రైల్వే స్టేషన్ లో ప్రయాణికులపై తేనెటీగలు దాడికి దిగాయి.