విద్యార్దులకు గొడ్డు కారం

గ్రామస్థుల మండిపాటు
సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం గొడ్డు కారం పొడి తొ నిర్వాహకులు అన్నం పెట్టారు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎందుకు కారం పొడితొ తింటున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.కూర సరిగా వండటం లేదని వారు జవాబు ఇచ్చారు.అనంతరం విద్యార్థుల తల్లి తండ్రులు అన్నం వండి పెట్టే ఏజన్సీ మహిళలను అన్నం వండకుండా అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు.డిఇఒ దుర్గ రావు పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నిర్వహకుల పై ఆగ్రహం వ్యక్తం చేసి ఇలా సాగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *