సిరాన్యూస్, బేల
బేలలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ రేంజ్ అధికారి అరుణ, మండల తహసీల్దార్ ,ఎంపీడీఓ తో కలిసి మొక్కలను నాటారు.
అంతకు ముందు పరిసరాలను అటవీ శాఖ సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. అనంతరం మండల అటవీ రేంజ్ అధికారి అరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే ఎంతో మనుగడ ఉంటుందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ, ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని, ఇంటిపరిసరాల్లో పండ్లు,పూలు, నీడనిచ్చె మొక్కలు నాటాలన్నారు. వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు, వాయు, నీటి కాలుష్యం, పరిసర ప్రాంతాల్లో కాకుండు చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ సవై సింగ్, ఎంపీడీఓ మహేందర్ కుమార్, పశువైద్యాధికారి సిద్ధార్థ్ కాంబ్లే, వైద్య సిబ్బంది రోజా అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.